ధ్యానము;-
యస్యాం బింబితమ్+ఆత్మ తత్వమాగమత్
సర్వేశ్వరాఖ్యాం శుభాం
యా విష్వగ్+జగదాత్మనా పరిణతా
యా నామరూపాశ్రయా
యా మూలప్రకృతిర్గుణ త్రయవతీ
యానంత శక్తి స్స్వయం
ఎవరు తానే విశ్వముగా, జగత్తుగా పరిణామం చెందినదో,
ఎవరు ఇన్ని పేర్లతో, రూపములతో కనబడుచున్నదో,
ఎవరు ఈ మూడు గుణాలు గల మూల
ప్రకృతియో,
ఎవరు స్వయంగా అనంత రూపాలైన
శక్తియో,
ఎవరు నిత్యమూ మళ్ళీ మళ్ళీ
ఆవృత్తమయ్యే తొమ్మిది రూపాలు కలదియో, అట్టి నవరూపాలుగా ఉన్న
దుర్గాదేవి జయము కలుగు.
నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం
నవరూప ధరాం శక్తిం, నవదుర్గాముపాశ్రయే
నవరాత్రులలో ఆరాధింపదగినది, శ్రీచక్రంలోనినవచక్రాలలో నివసించేది,
శక్తి రూపిణి, అయిన నవదుర్గను ఆశ్రయిస్తున్నాను.
స్తోత్రము;-
ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం
బ్రహ్మచారిణీ |
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి
చతుర్థకమ్ ||
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ |
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ ||
నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః
ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ
మహాత్మనా ||
దుర్గాదేవి గురించి మార్కండేయ మహర్షి బ్రహ్మగారిని అడిగితే వచ్చిన సంభాషణ లోంచి దుర్గాదేవి వివరాలు మనకు వరాహ పురాణాం నుంచి ఈ క్రింది విధంగా తెలుస్తుంది.ఇలా దుర్గాదేవి తొమ్మిది రూపాలతో విరాజిల్లుతుందనిఈ 9 నామాలను సాక్షాత్తు బ్రహ్మ దేవుడే వివరించారు.
No comments:
Post a Comment